Posts filed under ‘రాజకీయం’

నిజం నిప్పులాంటిదే.. కాస్త చేదుగా కూడా ఉంటుంది..!!

(ఇది ఆనందిని గారి టపా http://kovela.blogspot.com/2009/12/blog-post_14.html కి జవాబు.. రాయడం మొదలెడితే మరీ పెద్దదయ్యి కూర్చుంది.. అందుకని కొత్త టపా..!)

విశ్లేషణ బాగుంది .. కానీ, మీ టపాలో కొన్ని విషయాలని పాయింట్ చెయ్యాలి …నేను వ్యక్తిగతం గా రెండు లేదా మూడు రాష్ట్రాలకి వ్యతిరేకం కాదు, కానీ చాలా విషయాలలో మీరు చూపించినది నాణానికి ఒక  వైపు మాత్రమే..

1. సంస్కృతి-చిన్న చూపు : మీరు ఒక్క కృష్ణ, గుంటూరు తెలుగు తో పోల్చి అంటున్నారు.. మన అదృష్టమో, దురదృష్టమో గానీ.. తెలుగు కి చాల యాసలున్నాయి.. అది ఉత్తరాంధ్ర కావొచ్చు, గోదావరి జిల్లాలు కావొచ్చు, రాయల సీమ కావొచ్చు.. సమస్య, ఏదో కృష్ణ గుంటూరు యసలని ఒక “బెంచ్ మార్క్” టైపు లో తీసుకోవడం వల్ల వచ్చింది.. ఇది తెలంగాణా యాస ఒక్క దానికి సంబంధించిన సమస్య కాదు… (సో వాట్, మాకు మిగిలిన వాళ్ళ గురించి ఎందుకు అనొద్దు)
2 . “తెలుగు భాష మాట్లాడే వారందరినీ ఒక జాతిగా భావిస్తే, ఆ ప్రజలంతా కలిసి మెలిసి ఉండటం అంటే, పరస్పర మనోభావాలను గౌరవించుకోవటం జరగాలి. ఒకరితో మరొకరు మమేకం కావాలి. పండుగల్లో, పర్వదినాల్లో పరస్పరం కలగలిసిపోవాలి.. సంబరాలు చేసుకోవాలి.. సౌభ్రాతృత్వంతో మెలగాలి. భాషలోని యాసను గౌరవించాలి.” — ఇది “ideal situation” నా ఉద్దేశం లో..  జరగాల్సిన అవసరం ఉందని నేనైతే అనుకోవట్లేదు.. ఇప్పుడు అలా జరగటం లేదు కూడా.. చిన్న ఉదాహరణ.. తూర్పు గోదావరి లో ఉన్నా కాలేజీ లలోకి చాల మంది ఉత్తరాంధ్ర కుర్రాళ్ళు వచ్చి చదువుతూ ఉంటారు.. వాళ్ళందరినీ వేరేగా చూడటం, ఆట పట్టించటం చాలా చాలా కామన్.. వాళ్ళ పండగలు కూడా కొన్ని వేరేగా ఉంటాయి….ఇదే పరిస్థితి తూగో కుర్రాళ్ళది వైజాగ్ లో.. :) టిట్ ఫర్ టాట్ మరి..!!
సరే రెండు చేతులూ కలిస్తేనే చప్పట్లు అని..దానికి ఒక్క ఆంధ్ర వాళ్లనే తప్పు పట్టడం సరైనది కాదు..  ఈ మధ్య మీడియా పుణ్యమా అని కాస్త అక్కడి ఆడవాళ్ళు దసరా టైం లో బతుకమ్మ ప్రోగ్రాం లు ఆసక్తి గా చూడటం అవీ జరుగుతున్నాయి.. కొంతలో కొంత బెటర్…
౩. “తెలంగాణ అబ్బాయి ఆంధ్ర అమ్మాయిని వివాహం చేసుకుంటే, అబ్బాయి ఆంధ్రా వైపు మొగ్గుతాడు.. తెలంగాణ అమ్మాయి ఆంధ్ర అబ్బాయిని చేసుకుంటే అటోమెటిక్‌గా మారిపోతుంది..” — మీరు మరీ generalize  చేస్తున్నట్టు అనిపించట్లేదా?!!  ఏదో ఆంధ్ర వాళ్ళందరూ dominating characters  టైపు లో!!
4. “ఉస్మానియా విశ్వవిద్యాలయం నిజాం కాలం నాటిది… ఉస్మానియా మెడికల్‌ కాలేజీ, వుమెన్‌‌సకాలేజీ, హైకోర్టు, రాజ్‌భవన్‌, అసెంబ్లీ, దిల్‌కుశ్‌ గెస్‌‌టహౌస్‌, పురానాపూల్‌, నయాపూల్‌, మక్కామసీదు, హుస్సేన్‌సాగర్‌,”.. చాలా సింపుల్ గా తీసి పారేశారు కదండీ..! ఇది రాజధానే గా… దీన్ని మైంటైన్ చెయ్యడానికి ప్రజల పన్నులేగా వాడేది.. అది ఒక్క తెలంగాణా వాళ్ళేం కట్టలేదుగా..
అలాగే అంతర్జాతీయ విమానాశ్రయం, ఫ్లై ఓవర్ లు,  హైటెక్ సిటీ,  ఇంత infrastructure, ఇన్ని investments ఊరికే రావుగా… ఈ విషయం మాత్రం మీరు అర్ధం చేసుకోవాలి.. రాజధాని ఇక్కడ ఉన్నప్పుడు, పెట్టుబడులు పెట్టె పారిశ్రామిక వేత్తల తో పాటు, ఉద్యోగార్ధులు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా వస్తారు…. హటాత్తుగా ఇది మీది కాదు అంటే ఎవడికైనా కాలుతుంది…. ఇది రాజధాని కాబట్టి, ఇక్కడ బెటర్ opportunities ఉన్నాయి కాబట్టి, సొంతూల్లో పోలాలమ్మి అయినా వస్తారు.. ఇది నీ ఏరియా కాదు అంటే అంత తేలిగ్గా కుదిరే వ్యవహారం కాదు…
5. ” ఆంధ్రప్రాంత ప్రజలు తమ వనరులపై తాము సొంతగా జీవించలేరని, ఇతరుల వనరులపైనే… ” — కించ పరచడం, అవమానాలు గురించి మాట్లాడిన మీరే, ఇదే టపాలో మీరే ఆంధ్ర ప్రజలని కించ పరిచారు.. ఔరా! రాజధాని అప్పటిలాగే ఏ కర్నూల్ లోనో, లేకపోతె విజయవాడ లోనో ఉండి ఉండాల్సింది.. అప్పుడు తెలిసేది ఎవరు ఎవరి మీద ఆధారపడాల్సి వచ్చేదో..!!
6 “ఎందుకింత బేలతనం..?” — నిజమే, బేలతనమే, తమ హక్కుల కోసం పోరాడ లేని బేలతనం.. అన్నీ ఒకప్పుడు మద్రాస్ కి, ఇప్పుడు హైదరాబాద్ కి తరలిస్తుంటే మాట్లాడలేని బేల తనం… ఓ  హైటెక్ సిటీ, ఓ NIT, ఓ IIIT, ఓ IIT లేకుండా అన్నీ పక్క వాడికే ఇస్తుంటే, అందరూ మనవాళ్ళే అప్పుడు అనుకుని, ఇప్పుడేమో వాడు ఛీ పో అంటుంటే ఏం చెయ్యాలో తెలియని బేల తనం.. అమాయకత్వానికి మంచి శాస్తే జరిగింది.. ఇక ముందైనా తెలివి గా ఉండాలి..
7 మీ అనుకోలు – “రెండు జాతులు” అనేదే సరి కాదు.. తెలుగు వాళ్ళందరూ ఒకటే జాతి.. వేర్వేరు పాలకుల కింద ఉండటం మూలాన వేర్వేరు అలవాట్లు, కొంతమటుకు సంస్కృతి వచ్చాయి..  అలా కాదు అంటారా, జాతి అంటే మీ నిర్వచనం చెప్పండి మరి..!
8 ” హైదరాబాద్ తప్ప మిగిలిన తెలంగాణా ప్రాంతాల గురించి మాట్లాడకపోవడం”..  మిగతా ప్రాంతాలతో పెద్దగా సంబంధాలు లేవు కాబట్టి ముందు గుర్తొచ్చేది హైదరాబాదే.. అదీ కాక చాలా మంది “సెటిలర్స్” ఉన్నారు గా అక్కడ…సరే ఆంధ్ర/సీమ నాయకులు ఏదో చిత్త శుద్ధి తో మాట్లాడుతున్నారని నేను అనను..

ఒకటి మాత్రం ఒప్పుకుంటున్నా.. ఇంతకాలం నోర్మూసుకుని కూర్చుని ఇప్పుడు హడావుడిగా సమైక్యాంధ్ర అంటే అటు ఆంధ్ర/సీమ ఇటు తెలంగాణా ప్రజలు ఇద్దరికీ చిరాకే.. అంతకు ముందు అన్నీ పార్టీలు తెలంగాణాకి అనుకూలం అని ప్రకటించారు… నా ఉద్దేశం లో అప్పుడు ప్రజాభిప్రాయం (ఆంధ్ర/సీమ వాళ్ళ ది ముఖ్యం గా) పట్టించుకోలేదు .. జనాలు కూడా ఏం మాట్లాడకుండా ఊరుకున్నారు..ఇప్పుడు హటాత్తుగా రాష్ట్ర ఏర్పాటు విధానం ప్రారంభం అని ప్రకటించేసరికి ఎవ్వరికీ ఊపిరి ఆడట్లేదు.. అంతే!!

ఏది ఏమైనా,
రాజధాని హైదరాబాద్ కాకుండా ఉండి ఉంటే, ఇంత గోల అయ్యేదే కాదా.. ఇంకో రాష్ట్రం ఇవ్వడానికి..?!!
(ఏమో, అప్పుడు ఆంధ్ర వాళ్ళు రాష్ట్రం కావాలనీ, తెలంగాణా వాళ్ళు వద్దనీ అనొచ్చేమో!)

నాకు అర్ధంయ్యినంతవరకు, ఇప్పుడు కొత్త రాష్ట్రం కావాలి అంటే, ఆంధ్ర/సీమ వాళ్ళని ఒప్పించడం ఒక్కటే మార్గం…(concensus)!!

December 15, 2009 at 12:05 am 11 comments

బియ్యం కిలో రూ. 20 కా? ఎక్కడండీ బాబూ?!

ఓ పక్క మన మంత్రి గారు తనిఖీలు చేస్తూ ‘సూపర్ ఫైన్’ రకం బియ్యం కేవలం 20 రూపాయలకే అమ్మేలా చూస్తున్నామంటారు.. ఇంకో పక్క ముఖ్య మంత్రి గారు చంద్ర బాబు కొట్లలో తప్ప అన్ని చోట్లా 20 కే అమ్ముతున్నారంటూ తనదైన శైలి లో వ్యంగ్యం గా  జవాబిస్తారు…

అంత నమ్మకంగా చెప్తుంటే నిజమనే అనుకుందాం…  హైదరాబాదులో సాధారణ కిరాణా షాపులో అడిగా..  రూ. 27 అన్నిటికంటే తక్కువ రకం.. రూ. 30 ది ఒక మాదిరిగా ఉంది.. నేను చంద్రబాబు కొట్లలో కొననే కొనను.. అడిగింది మామూలు షాపు.. పోనీ హైదరాబాదు కదా ఎక్కువే ఉంటుంది, మిగిలిన చోట్ల తక్కువే ఉంటుంది అనుకుని, సొంతూరు అమలాపురం లో అడిగా.. ఎక్కడా 26 కి తక్కువే చెప్పలేదు ఎవరూ.. నేను అక్కడ ఉన్న అన్ని బియ్యం రకాల రేట్ల గురించీ అడిగాను మరి…

అసలు ఈ ‘సూపర్ ఫైన్’  బియ్యం అంటే ఏంటి? బయట మామూలుగా మనం కొనే కిరాణా కొట్లలో (పెద్ద షాపులని మర్చిపొండి ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు) ఈ రకం అమ్మరా? అంటే సాధారణ ప్రజలు తినేది ఈ రకం కాదా? అప్పుడు దాన్ని తక్కువకి అమ్మడం వల్ల జనాలకి ఉపయోగం ఏంటి? మరి అలా కాకపోతే సాక్షాత్తూ ముఖ్యమంత్రి గారే అబద్ధం చెప్తున్నట్టా? లేకపోతే ప్రభుత్వం కళ్ళు మూసుకుని కూర్చుందా?  అబ్బే… నాకైతే ఏం అర్ధం కావట్లేదు…!!

January 25, 2009 at 11:02 pm 4 comments

Can this be a solution?

Today I went to my college (IIIT Hyderabad) and located groups of new faces wearing suits and walking around busily. When asked, I found that they are students of special program organized by one of the Directors of the college (I think Dr. Raj Reddy). All those people are from remote areas of Andhra Pradesh. Students from various undeveloped areas are selected, they are brought here for a full year for this course. As I understand, the aim of this course is to make them suited for the current day’s ‘hot’ IT/BPO jobs. Students are selected based on a screening test, and those who did well in the test are given seats for free. Mind you, people are not discriminated by their social backwardness. Not to mention, people got selected from all three regions of AP..! :) Many of them are bright students who stopped studying due to weak economic conditions. Essentially the entry criteria was how a student performed in his 10th or 12th, the entrance test score and his economic situation.

I talked to some of the students who are studying there. Their schedule is really hectic. Classes spawn from Morning till night. Attendance and Uniform are must. They said that this course was extremely useful. I believe this kind of initiative will be really helpful.

Now, this is my question. Can our government and the political parties can even think of this kind of solution for the upliftment of the backward people of India? How on the earth will the 100+ seats in IIMs help the uplifting of crores of backward people? Why do the political parties fear doing it? They cannot survive, if there does not exist tensions between different social groups. If everyone in India is well educated and sensible citizens, they cannot rig the elections and bribe the voters to win..

Are these the reasons? I do not know.

April 28, 2007 at 10:56 pm Leave a comment

ఈ వాళ రాష్ట్రం బంద్!!

ఏమో అనుకున్నా గానీ, తమిళనాడు నాయకులకే కాదు, మన వాళ్ళకి కూడా బుర్ర లేదని అర్ధమయ్యింది ఇవ్వాళ నాకు! బంద్ పెట్టి ఏం పీకుతారో నాకు అస్సలు అర్ధం కాలేదు… పైగా దీనికి అన్ని పార్టీలూ ‘మద్దతు ‘ ప్రకటించాయట…

నాకు తెలిసి ఇది ఒక chain reaction. ఏదో ఒక పార్టీ మొదలుపెడుతుంది ఓట్లను ఆకర్షించటానికి. ఎక్కడ ఆ సామాజిక వర్గం వాళ్ళు తమకి దూరం అవుతారో అని భయంతొ మిగిలిన పార్తీల వాళ్ళు follow అవుతారు. ఈ బంద్ విషయంలో మొదలెట్టింది తెదేపా. తర్వాత గొంతు కలిపింది తెరాస, ఇంక మిగిలిన పార్తీలూ… కానీ ఒక్కడు కూదా బంద్ రోజు సామన్యుల జీవితం ఎంత ఇబ్బందుల పాలవుతుందో అలోచించడు…ఇవ్వాళ బంద్ పెదితే రేపు ఓబీసీ కోటా అమలు చెసేస్తారా? అది నాకు తెలియదు… కానీ ఇవ్వాళ అందాల్సిన వైద్యం అందకపొతే, శ్వాస ఆగిపోయె అభాగ్యులలో ఓబీసీలెంతమందో మన నాయకులకే తెలియాలి…

Hats off to AP politics!

April 3, 2007 at 6:33 pm Leave a comment

హైదరాబాదు To సింగపూరు!

“ఇంకొక్క రెందేళ్ళు ఓపిక పట్టండి… మన భాగ్య నగరం సింగపూర్ తొ పోటీ పడుతుంది”.. అని సెలవిచ్చారు మన ముఖ్యమంత్రివర్యులు! అయితే, అది ఏ విషయంలోనా అని నాకు సందేహం వస్తోంది! ఇప్పటికే మన రాజధాని చాలా విషయలలో ముందంజలో ఉంది..

నగరం లో ఉన్న ప్రధాన రోద్లలో drive చెయ్యాలంటే భయం.. traffic, కాలుష్యం… (కొన్ని రోజుల క్రిందట ఈనాడు లొ హైదరాబాద్ lo pollution level ఉండాల్సిన దానికంటే ఎన్ని “రెట్లు” ఎక్కువ ఉందో article వచ్చింది) పొనీలే బయటకి పోకుందా ఇంట్లోనే పడి ఉందాం అంటె… మన MCH వాళ్ళకి పరిసరాల పరిశుభ్రత మీద చాల ధ్యాస ఎక్కువాయె.. ఒక్కోసారి dengue, ఇంకొక సారి hepatitis…వీటి భయాలు… ఇవన్నీ కాక, నీళ్ళు ఎప్పుడు వస్తాయో తెలియదు, కరెంట్ ఎప్పుదు పోతుందో తెలియదు….!!

Pessimistic గా మాట్లాడుతున్నా అనుకోవద్దు…. కానీ, ఒక నగరం అభివృధ్ధి చెందాలి అంటే, ముందు basic amenities/requirements తీర్చాలి నా అభిప్రాయం ప్రకారం… రింగు రోడ్లు, వాటి చుట్టూ ప్లాట్లు కడితే అవి రావు గదా….!! వచ్చే పదేళ్ళ లోపు ఆంధ్ర దేశం లో ఉన్న జనాభా లొ 8% ఇక్కడ ఉంటారు అంటే వలస లు ఎంత తీవ్ర స్థాయి లో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు… globalization, IT boom, కారణాలు ఏవైనా అనుకోండి.. basic needs తీర్చగలిగినప్పుడే మన నగరం అంతర్జాతీయ స్థాయికి చేరగలుగుతుంది…

March 27, 2007 at 8:50 pm Leave a comment


Categories

Feeds

 

May 2012
M T W T F S S
« Jul    
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

Recent Posts

Firefox 3

Follow

Get every new post delivered to your Inbox.